పవన్ కల్యాణ్..ఆ నేతపై చర్య తీసుకుంటారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భీమవరం నుండి గెలిచిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన పార్టీకి సంబంధించిన జడ్పిటిసి చేసిన కుంభకోణం గురించి చర్చ తీసుకొస్తున్నారు. జన సేన పార్టీ జడ్పిటిసికి సంబంధించి 250 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఒకే ఒక్క వ్యక్తి. ఆయన పేరే జయప్రకాష్ నాయుడు. తెలంగాణలో చేప పిల్లల సప్లై కోసం టెండర్లు పిలిస్తే పాల్గొని దక్కించుకున్నాడు. బ్యాంక్ గ్యారంటీల కింద ట్యాంపర్ చేసి ఇచ్చారట.
అలాగే సోమశిల రిజర్వాయర్ లో చేప పిల్లల కాంట్రాక్ట్ కూడా ఈయన దక్కించుకున్నారని తెలుస్తుంది. అయితే అక్కడ ప్రాడ్ చేసి దొరికారట. అలాగే ఆయన పాలకొల్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి బ్యాంకు గ్యారంటీలు కూడా తీసారని చెప్తున్నారు. అయితే ఆ బ్యాంక్ అధికారులకు తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి మెయిల్స్ వస్తే మేము అలాంటి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదని చెప్పారట బ్యాంకు వాళ్లు.
తెలంగాణలో పెద్దలను అడ్డం పెట్టుకుని బ్యాంకు విచారణను వాయిదా వేసుకున్నారు జయ ప్రకాష్ నాయుడు. అలాగే బ్యాంకు అధికారులను కూడా ఫిర్యాదు చేయకుండా ఆపుకుంటున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. అయితే గతంలో ఆంధ్ర జ్యోతి వైఎస్ఆర్సిపి నాయకులు కుంభకోణం చేశారని ఆరోపించింది. కానీ ఇప్పుడు గ్రంధి శ్రీనివాస్ ఈ జెడ్పీటీసీ పైన ఎంక్వయిరీ చేయమని చెప్పడం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టాలని అంటున్నారు.