ఒకే మహిళతో అన్నదమ్ములు అక్రమ సంబంధం.. చివరికి ఓ రోజు?

praveen
ఇటీవల కాలంలో మానవ బంధాలకు విలువే లేకుండా పోయింది. ఎందుకంటే అక్రమ సంబంధాల పేరుతో ఏకంగా మనుషులు బంధాలకు విలువ ఇవ్వకుండా నీచమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. క్షణకాల సుఖం కోసం చేయకూడని పనులు అన్ని కూడా చేసేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న దారుణ ఘటనలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు అన్నదమ్ముల కథ చివరికి విషాదంగా ముగిసింది.

 బెంగళూరు నగర శివారులోని డబ్బాస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోంపూర్ తాలూకాలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 25 ఏళ్ల నగేష్ దారుణ హత్యకు గురి అయ్యాడు. అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ళ నవీన్ అనే యువకుడు నగేష్ ను హత్య చేశాడని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. వీరిద్దరు కూడా చిన్నాన్న పెద్దనాన్నల పిల్లలు. వీళ్లు అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల కలిసిమెలిసి తిరిగేవారు. ఇద్దరు కూడా వేరువేరు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే ఏల్లిక్యాతన హాల్లికి చెందిన వివాహితతో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ వివాహేతకు అప్పటికే భర్త పిల్లలు ఉన్నారు.

 ముందుగా నగేష్ తో వివాహేతర సంబంధానికి తెరలేపింది సదరు మహిళ. కొంతకాలానికి నగేష్ తమ్ముడు నవీన్ కి కూడా వలవేసి అతనితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుని.. ఒకరికి తెలియకుండా ఒకరిని కలుస్తూ వచ్చింది. కానీ నిజం ఎన్నాళ్లు దాగదు కదా. ఈ క్రమంలోనే నగేష్ అక్రమ సంబంధం గురించి నవీన్ కు తెలిసిపోయింది. ఇక నవీన్ కూడా తన ప్రియురాలితో తిరుగుతున్నాడని నాగేష్ కు తెలిసి కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయంపై తరచూ ఈ ఇద్దరు యువకులు గొడవ పడుతూ ఉండేవారు. ఇటీవల నవీన్ రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఉన్న నగేష్ కు ఫోన్ చేసి ఎల్లిఖ్యాతన హళ్లి గ్రామానికి పిలిచాడు. ఇద్దరు మద్యం సేవించారు  తర్వాత పొలంలో చీకట్ లో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మధ్యమధ్యలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. సహనం కోల్పోయిన నవీన్  కత్తి తీసుకుని దారుణంగా అన్న నాగేష్ ను పొడిచి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని పట్టుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: