ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
సభ్య సమాజంలో నేటి రోజులలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రస్తుతం సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్న విషయం అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొన్నటి వరకు మనుషులు అంటే మానవత్వం జాలి దయ గుణానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏకంగా క్రూరత్వానికి చిరునామాగా మారిపోతున్నారు. మొన్నటి వరకు అడవుల్లో ఉండే మృగాలు మాత్రమే ప్రమాదకరమైనవి అనుకునేవారు. కానీ ఇప్పుడు మనుషుల ప్రవర్తన తీరు చూస్తే మనుషులతో పోల్చి చూస్తే మృగాలే బెటర్ అనే భావన కూడా ఎంతో మందిలో కలుగుతుంది.

 ఎందుకంటే తాను మనిషిని అన్న విషయాన్ని మరిచిపోతున్నా అదే మనిషి చివరికి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాడు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో మృగాలుగా మారిపోతున్న మగాళ్లు.. ఏకంగా వరుసగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఏకంగా మృగంగా మారిపోతూ దారుణంగా కామపు కోరలును విసురుతూ ఉన్నాడు మనిషి. దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడి పరిస్థితి నేటి రోజుల్లో దాపురించింది. అయితే కామందులను శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టలు తీసుకువచ్చిన ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.

 కాగా ఈ మధ్యకాలంలో ఇలా ఆడపిల్లలపై అత్యాచారం చేసినందుకు కోర్టులు కూడా కఠిన శిక్ష విధిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఏకంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి లోని పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జయంతి ఇటీవల ఈ తీర్పును వెలువరించారు. పటాన్చెరులోని ఆల్విన్ కాలనికి చెందిన 30 ఏళ్ల నవీన్ 2018లో ఓ చిన్నారిపై అత్యాచారం చేశాడు. కేసు పై విచారణ జరుగుతూ రాగా.. ఇటీవల నేరం రుజువు కావడంతో నవీన్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష.. 20000 రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: