అనుమతి లేకుండా అంబానీ పెళ్లికి ఇద్దరు యువకులు.. చివరికి?

praveen
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక ఇటీవల ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఎన్నోసార్లు మన వార్తల్లో అంగరంగ వైభవంగా అనే పదం విన్నాం. కానీ ఆ పదానికి అసలైన నిర్వచనం ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లి అని చెప్పాలి. ఎందుకంటే ఇక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా అంబానీ ఇంత పెళ్లికి హాజరయ్యారు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహం ఇలా కన్నుల పండువగా జరిగింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకనే అటు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ముకేశ్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెడుతున్నారో.. ఇక పెళ్లికి విచ్చేసిన అతిధులకు రిటర్న్ గిఫ్ట్ గా ఏం ఇస్తున్నారు.. ఇక వాటి ఖరీదు ఎంత అనే విషయం గురించి తెలుసుకుని అందరూ షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ పెళ్లి వేడుకలో అతిథుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు ఏమిటి అన్న విషయం కూడా తెలుసుకున్నారు అని చెప్పాలి. సాధారణంగా ఇక అంబానీ పెళ్లి వేడుకకు రావాలి అంటే తప్పనిసరిగా ఆహ్వానం అందాల్సిందే. అంతే కాదు ఇలా పెళ్లికి వచ్చిన గెస్ట్ లకు ఒక ప్రత్యేకమైన ఐడి కూడా ఉంటుంది.

 ఇక బయట జరిగే సాదాసీదా పెళ్లి లాగా పిలవకుండా పెళ్లికి వెళ్లడానికి అసలు అవకాశం ఉండదు. కానీ అంబానీ పెళ్లి వేడుకకు కూడా ఇద్దరు ఇలాగే పిలవకుండా వెళ్లారట. ఈ క్రమంలోనే ఇలా అంబాని, రాధిక మర్చంట్ల పెళ్ళికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన ఇద్దరిని  ముంబై పోలీసులు అరెస్టు చేసారూ. వారిపై బాంద్రా కుర్ల కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు 26 ఏళ్ళ అల్లూరి వెంకటేష్ నరసయ్య కాగా మరొకరు 25 ఏళ్ల షేక్ షమి కావడం గమనార్హం. వీరిద్దరూ ఏపీ నుంచి వచ్చినట్లు అటు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వీరికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా అంబానీ ఎంత పెళ్లి వేడుకకు ఉన్న సెక్యూరిటీని దాటుకుని వీరు ఎలా వచ్చారు అనే విషయంపై కూడా పోలీసులు విచారణ జరుగుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: