స్మశానంలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన దొంగలు బెడదా తీవ్రమైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటి యజమానులు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే దొంగలు ఎన్నో రకాలుగా ఉంటారు. కొంతమంది తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకొని ఇక ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించి అందిన కాడికి  దోచుకుపోతూ ఉంటారు. ఇంకొందరు ఇక రోడ్డుపై నడుస్తున్న ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకొని చైన్ స్నాచింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. మరి కొంతమంది ఇక పెద్దపెద్ద రహదారులపై దారిదోపిడిలకు పాల్పడుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చోరీలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే దొంగల గురించి మాత్రం ఇప్పటివరకు మీరు కనీసం కనీ విని ఎరిగి ఉండరు. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఏకంగా స్మశానంలో చోరీలు చేస్తున్నారు. అదేంటి స్మశానంలో ఏమంటుంది బూడిద తప్ప అక్కడ ఏం దొంగతనం చేస్తున్నారు అని అవాక్కవుతున్నారు కదా. ఏకంగా చనిపోయిన వారి ఎముకలను దొంగతనం చేస్తున్నారు. శవాలని దహనం చేయగా మిగిలిన పుర్రెలు,ఎముకలను చోరీ చేస్తున్నారు. ఈ విచిత్రమైన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సుల్తానాబాద్ లోని హిందూ స్మశాన వాటికలో రెండు రోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు చోరీ చేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు.

 శవాలను దహనం చేసిన తర్వాత ఎముకలను పోగు చేసి ఒక సంచిలో వేసుకుని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికులు ముందుగా ఇద్దరు యువకులను పట్టుకోగా.. ఎముకలని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇక తర్వాత ఇద్దరు మహిళలు స్మశానంలో ఎముకలు పోగు చేస్తూ మున్సిపల్ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలా ఎందుకు ఎముకలను దొంగలిస్తున్నారు అనే విషయంపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇలా ఎముకల దొంగల విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: