జైలు నుండి విడుదలైన పావురం.. ఇంతకీ ఏం చేసిందంటే?

praveen
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలా ఇంటర్నెట్ లో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా షాల్ కి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల గురించి సినిమాల్లో చూడడం తప్ప నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయి అని వినడం మొదటిసారి అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు నేరాలకు పాల్పడ్డారు అంటే చాలు వారిని పోలీసులు అరెస్టు చేస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే వారిని జైల్లో పెట్టి కేసు పై విచారణ చేస్తూ ఉంటారు. ఇక విచారణ తర్వాత ఆధారాలను సేకరించి ఇక అరెస్టు చేసిన నిందితుడిని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ ప్రాసెస్ పూర్తయినని రోజులు కూడా నేరారోపణ ఎదుర్కొంటున్న నిందితుడు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టులో నిర్దోషి అని తేలితే చివరికి అతని విడుదల చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే పోలీసులు ఇలాగే రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు అనగానే ఎవరో మనిషిని అనుకునేరు. కాదు ఏకంగా పావురం పోలీస్ కస్టడీ నుంచి విడుదలైంది.

 పావురం పోలీస్ కస్టడీ నుంచి విడుదల కావడం ఏంటి.. అంటే నేరం చేసిందని ఆ పావురాన్ని అరెస్టు చేశారా ఏంటి అంటారా.. మీరు చెప్పింది నిజమే. పావురాన్ని అరెస్టు చేయగా ఇటీవలే పోలీస్ కస్టడి నుంచి పావురం విడుదలైంది. గత ఏడాది మేలో ముంబై పోస్టు వద్ద సంచరిస్తున్న పావురం రెక్కలపై చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. గూడ చర్యం చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు.. ఆ పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఎలాంటి కూడా గూడ చర్యానికి  పాల్పడలేదని తేల్చారు. అలాగే పక్షిని అనవసరంగా బంధించారు అంటూ పెటా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఉండడంతో చివరికి ఆ పావురాన్ని విడిచిపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: