ఓరి నాయనో.. కళ్ళు తాగిన మత్తులో మహిళ ఏం చేసిందో తెలుసా?

praveen
మత్తు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది.. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తుంది. ఇంకెన్నో ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది. కొంతమంది మద్యం మత్తులో చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది మాదక ద్రవ్యాల మత్తులో చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది లోకల్ గా దొరికే కళ్ళు , గుడుంబా అంటూ చివరికి కుటుంబం రోడ్డున పడే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా మత్తు ఒక మనిషిని అన్ని విధాలుగా నాశనం చేస్తుంది అనడానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.

 ఇక ఇక్కడ హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో కూడా ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కళ్ళు తాగిన మత్తులో ఒక మహిళ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు. కల్లు తాగిన మత్తులో  ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్న మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. గోపి నగర్ కాలనీ రోడ్డు నెంబర్ త్రీ లో ఉండే షమీం బేగం అనే 58 ఏళ్ల మహిళ గత ఏడాది భర్త చనిపోవడంతో కుమార్తె సహేరా బేగంతో ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి ఆమె మానసికంగా బాధపడుతుంది.

 ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఏకంగా యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది  సదరు మహిళ. అయితే ఆమెకు ప్రతిరోజు కూడా కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో ఎప్పటిలాగానే ఇటీవలే కళ్ళు తాగింది. అయితే తాగిన మత్తులో షమీం బేగం రాత్రి సమయంలో ఏకంగా ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ వేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆమె కేకలు వేయడంతో కూతురు సహెరా బేగం తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. స్థానికులు వచ్చి సహాయం చేయడంతో ఇక తీవ్ర గాయాల పాలైన షమీం బేగం ని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: