మూత్రం పోస్తుంటే నొప్పి వస్తుందని.. పురుషాంగాన్ని నరుక్కున్నాడు?
ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పాలి . అయితే ఇటీవలి కాలంలో ఇతరులను గాయపరిచి హత్యలు చేస్తున్న వారు మాత్రమే కాదు ఇక ఇక వారి విషయంలో వారే కాస్తయినా జాలి దయ చూపించుకోవడం లేదు అని తెలుస్తోంది. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న తీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మూత్రం పోస్తున్న సమయంలో నొప్పి కలుగుతుంది అనే కోపంతో వృద్ధుడు ఏకంగా పురుషాంగాన్ని పదునైన గొడ్డలితో నరుక్కున్నాడు ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం గానే మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఇక వృద్ధుడు కోపంలో చేసిన పని చివరికి అతని ప్రాణాల మీదికి తెచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దామోహ్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న 75 ఏళ్ల వృద్ధుడు కిడ్ని సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో మూత్రవిసర్జన సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. మూత్రం పోసే సమయంలో మంట తో పాటు తీవ్రమైన నొప్పి కూడా వస్తుందని వస్తూ ఉండటంతో తట్టుకోలేక పోయేవాడు రోజు ఇక అతనికి ఓపిక క్షీణించి కోపంతో ఊగిపోయాడు. దీంతో గోడ్డలితో అతని పురుషాంగాన్ని నరుక్కున్నాడు. ఈ క్రమంలోనే పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా గమనించి అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పరీక్షించిన వైద్యులు వృద్ధులు జననాంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పాలి. అతని పరిస్థితి విషమంగానే ఉండటం..