మత్తులో చెట్టుకు సంకెళ్ళు వేసిన వ్యక్తి.. నెటిజన్స్ ఏమన్నారంటే..?

Satvika
తాగితే చాలా మందికి చిన్న మెదడు పని చెయ్యధు అన్న సంగతి తెలిసిందే.. అందుకే తాగుబోతు మాటలను పెద్దగా పట్టించుకోకూడదు అని అంటారు.. అయితే ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా వారికి తెలియదు..తాగింది దిగితే కానీ తమాషాగా ఉండదు.. అయితే ఇప్పుడు ఓ తాగుబోతు మాత్రం వింత పని చేశాడు.అతని ఎదో చెద్దామని అనుకొని చెట్టుకు కట్టేశాడు.వామ్మో అతనికి పిచ్చి పట్టిందా అని అనుకోవడం సహజం.. అసలు విషయాన్నికొస్తే.. ఇది నిజంగా జరిగింది..ఈ వింత ఘటన పై ఓ సారి చుద్దాము పదండి..

బ్రిటీష్ అధికారులు ఏకపక్షంగా, ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. విచిత్రమైన శిక్షలు విధించేవారు. వాటిని వింటే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది.ఒక ఆంగ్ల అధికారి వింత ఉత్తర్వు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్ కూడా భారత్‌లో భాగమే. ప్రస్తుత పాక్‌లోని పెషావర్ నగరంలో ఇప్పటికీ గొలుసులతో బంధించిన ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది.ఆనాటి ఆంగ్ల అధికారి ఫుల్లుగా మద్యం తాగి, ఒక చెట్టును అరెస్టు చేయమని ఆదేశించాడు. ఈ కేసు 1898 సంవత్సరం నాటిది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ చెట్టు ఇప్పటికీ గొలుసుల మధ్య బందీగా కనిపిస్తుంది.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్న లాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ (అప్పటి భారతదేశం)లో నియమితుడైన జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ అధికారి ఆ రోజు విపరీతంగా మద్యం తాగాడు. మద్యం మత్తులో పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఆ అధికారికి తన ముందు చెట్టు నడుస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఆ చెట్టును అరెస్టు చేయాలని మెస్‌లోని సార్జెంట్‌ను ఆదేశించారు. దీంతో అక్కడ ఉన్న సైనికులు ఆ చెట్టును గొలుసులతో కట్టారు..ఆ తర్వాత ఇండియా స్వాతంత్య్రం పొందింది..పాకిస్తాన్ నూతన దేశంగా ఏర్పడింది. అయినా ఆ చెట్టుకు ఇప్పటికీ బంధ విముక్తి లభించలేదు. ఈ చెట్టు బ్రిటిష్‌వారి అణచివేతకు గుర్తు అని అని పాకిస్తాన్‌వాసులు భావిస్తారు. ప్రస్తుతం ఈ చెట్టు పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ చెట్టుపై 'నన్ను అరెస్టు చేశారు' అని రాసి ఉన్న ప్లకార్డు కనిపిస్తుంది...మొత్తానికి ఇదోక విచిత్రం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: