పవన్: భయంతో అన్నయ్యకు పిలుపు..!
మరొకవైపు వైసీపీ అభ్యర్థి అయినటువంటి వంగా గీతాకు కూడా ప్రజా ఆదరణ బాగానే ఉన్నది. ఈమె స్థానికరాలు ప్రజలకు అందుబాటులో ఉంటుంది నోటిఫికేషన్ రాకముందే పలు రకాల నియోజకవర్గాలను చుట్టేస్తోంది.. పవనేమో ఒకరోజు పర్యటన చేస్తే రెండు రోజులు జ్వరంతో హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. దీంతో తను గెలవడానికి తన సత్తా ఒకటే సరిపోదని తన అన్నయ్య చిరంజీవి పాపులారిటీ కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారట.
అందుకే తన అన్నయ్యని ప్రచారానికి పిలిపించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయనని గతంలో కూడా చిరంజీవి తెలియజేశారు. అయితే ఈ మధ్యనే మాట మార్చి పంచకర్ల రమేష్ ,సీఎం రమేష్ లను పక్కన కూర్చోబెట్టుకొని కూటమిని గెలిపించాలంటూ మళ్ళీ పిలుపునివ్వడంతో మే 5వ తేదీన చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చిరంజీవి ప్రధాన సభలు రోడ్డు షోలలో కూడా చిరంజీవి పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.