దారుణం.. కనికరం లేకుండా పసిపిల్లను ఎలా చేసారో చూడండి..
ఒక బాలికపట్ల ఆమె తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి మిద్దెపై మండుటెండలో ఉంచారు. దీంతో ఎండను తట్టుకోలేక ఆ చిన్నారి విలవిల ఏడ్చింది..ఈ దారుణ ఘటన దేశ రాజదాని ఢిల్లీ లో వెలుగు చూసింది.. వివరాల్లొకి వెళితే..జూన్ 2న కరవాల్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు ఈ వీడియోను ఢిల్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలికను దారుణంగా శిక్షించిన తల్లిదండ్రులను, ప్రాంతాన్ని గుర్తించేందుకు నానా తిప్పలు పడ్డారు. తొలుత కరవాల్ నగర్ ప్రాంతంలో ఆరా తీయగా ఆ ప్రాంతంలో అలాంటి సంఘటన జరుగలేదని తెలిసింది. అనంతరం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగం లోకి దించారు. చివరకు ఖజురి ఖాస్ ప్రాంతంలో ఒక ఇంటిని గుర్తించారు. ఆ బాలిక తల్లిదండ్రులను దీనిపై ఆరా తీశారు. అయితే స్కూల్ హోమ్ వర్క్ చేయలేదన్న కోపంతో కేవలం 5-7 నిమిషాల పాటు ఇలా శిక్షించినట్లు బాలిక తల్లి పోలీసులకు చెప్పింది.ఆమె తల్లి దండ్రులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ విషయం పై పూర్తీ విషయాలు తెలియాల్సి ఉన్నాయి.