షాకింగ్ : బ్రష్ చేసినందుకు ప్రాణం పోయింది?

praveen
మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని అంటే  నేటి రోజుల్లో ఎవరైనా సరే ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజం అని నమ్మకుండా ఉండలేరు. ఎందుకంటే కొన్ని సంఘటనలు అత్యంత చిత్రం గా కనిపిస్తూ ఉంటాయి. అనుకోని విధంగా ప్రాణాలు పోతుంటాయి. ఇది చూసిన తర్వాత  విధి రాత అనే పదాన్ని ట్రాష్ అని కొట్టేసిన వారే నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఓ యువతి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. పళ్ళు తోముకోవడం వల్ల పదిహేడేళ్ల శ్రావ్య అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. అదేంటి పళ్ళు తోముకోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం ఏంటి కాస్త విచిత్రంగా ఉందే అని అనుకుంటున్నారు కదా

 ఇలా సదరు యువతి ప్రాణాలు కోల్పోవడం వెనుక ఒక వింత ఘటన దాగి ఉంది. టూత్ పేస్ట్ అనుకొని ఎలుకల మందు తో బ్రష్ చేసింది. దీంతో  అస్వస్థతకు గురైన ఆ యువతి చివరికి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసింది.  ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని సూర్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మార్కంజ గ్రామానికి చెందిన శ్రావ్య ఇంటర్ చదువుతోంది. హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తోంది.. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో ఇంటికి వచ్చేసింది.

 ఇటీవలే రాత్రి పడుకునే సమయంలో బ్రష్ చేసుకుంది శ్రావ్య. అయితే ఇంట్లో టూత్ పేస్ట్ ఉండాల్సిన ప్లేస్ లో తెల్లని పేస్టు రూపంలో ఎలకల మందు ఉంది. ఇక అది గమనించకుండా టూత్ పేస్ట్ కు బదులు ఎలకల మందు తో బ్రష్ చేసుకుంది. టేస్ట్ కాస్త తేడా కొట్టడంతో వెంటనే నోరు పుక్కిలించింది. శ్రావ్య తర్వాత కాసేపటికి నిద్రపోయింది. కానీ చివరికి అస్వస్థతకు గురైంది. ఇక రోజుల గ్యాప్ లోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆ తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.  రెండు రోజులు చికిత్స తీసుకుంటూ చివరికి తుది శ్వాస విడిచింది. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: