కూమార్తె ప్రేమ వివాహం..బలైన కుటుంబం..

Satvika
ఈరోజుల్లో ప్రేమ కలపాలు ఎక్కువ అవుతూన్నాయి.. కొన్ని ప్రేమలు పెళ్ళి వరకూ వెళితే.. మరి కొన్ని మాత్రం పెద్దల చర్చల వరకూ వెళుతూన్నాయి. మరి కొన్ని ప్రేమలు మాత్రం పెళ్ళి వరకూ వెలుథున్నాయి. అది కూడా కులాంతర వివాహాలను చేసుకోవడం చెస్తున్నారు. అందులో కూడా కొన్ని నిలబడి జీవితాంతం వుంటే మరి కొన్ని జంటల ప్రేమ మాత్రం పెద్దల కొపానికి బలవుథుంది. ఇప్పుడు ఒక ప్రేమ జంట వివాహం నలుగురు ప్రాణాలును తీసింది. ఇది నిజంగా భయంకరంగా జరిగింది. కూతురు వేరే వాడిని పెళ్ళి చెసుకుందని, పరువు పోయిందని బాధలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో పాపం..

వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత తండ్రి ఆత్మహత్యకు చేసుకున్నాడు. వివరాలు ఇలా..లక్ష్మణ్ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మణ్‌ జీవనోపాధి కోసం టీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా అతని పెద్ద కుమార్తె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
 

ఈ ఘటన పై అందరూ సూటి పోటీ మాటలు అంటుంటే అతను కుమిలి కుమిలి ఏడుస్తూ వున్నారు..ఈ విషయం పై  తీవ్ర మనస్తాపానికి గురైన అతను పరువు పోయిందని బాధ పడ్డారు.. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న పెద్ద కుమార్తె తన భర్తతో వేరే ఎరియాలొ భర్త తో కాపురం చెస్తుంది. కుటుంబం మొత్తం చనిపోయిన విషయం తెలుసుకున్న కుమార్తె బోరున విలపించింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. కుటుంబం మొత్తం ఇలా చనిపోవడం తో తీవ్ర విషాధ చాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: