రెప్పపాటు క్షణంలో తప్పిన ప్రమాదం... లేదంటే?
అక్కడ ఇక్కడ రైలు పట్టాలు వద్ద వాహనాలు దిగడం కోసం మార్గం ఉంటుంది. అయితే ముందు జాగ్రత్త కోసం అక్కడ రైల్వే గేట్ వేసి ఉంటారు. రైలు వచ్చే సమయంలో తప్ప మిగిలిన సమయంలో ఆ గేటును తెరిచి ఉంటారు. అలాంటి సమయంలో ప్రజలు ఆ గేటు దాటి అవతలి వైపుకు వెళ్ళవచ్చు. అయితే కొన్ని సార్లు రైల్వే గేటు మూసి ఉన్నప్పటికీ కొందరు ఆ కాసేపు సమయం కూడా వేచి ఉండలేక రైలు వస్తుందా లేదా అన్నది కనీసం గమనించకుండా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సమయంలో కొందరు రైల్వే గేటు దాటి మరి కొందరు మాత్రం దురదృష్టవశాత్తూ రైలు ప్రమాదంలో మరణిస్తున్నారు.
తాజాగా ఓ వ్యక్తి రైలు గేటు వేసున్నప్పటికీ త్వరగా వెళ్ళాలనే యోచనతో ఏమాత్రం ఆలోచించకుండా బండిని ఆ గేటు పక్క నుండి వంచి తీసుకుని మధ్యలోకి వచ్చేశాడు దాటుతున్న సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో అది గమనించిన అక్కడి జనం పెద్దగా అరిచారు. దాంతో ఆ వ్యక్తి తన మోటారు వాహనాన్ని అక్కడే వదిలి వెనక్కి వెళ్ళిపోయాడు. దాంతో తన ప్రాణాలు దక్కాయి. లేదంటే ఏమై ఉండేది. కేవలం పది పదిహేను నిమిషాలు వెయిట్ చేయలేక అతడు చేసిన సాహసం ప్రాణం మీదకు తీసుకువచ్చింది. ఆ వీడియోని ఇపుడు రైల్వే శాఖ వారు సోషల్ మీడియాలో ఉంచి రైల్వే గేటు మూసి ఉన్నప్పుడు లెవెల్ క్రాసింగ్ ఎందుకు దాటకూడదు అన్నది అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలం కన్నా ప్రాణం మిన్న అన్నది తెలుసుకుని జీవించండి అని ఆ వీడియో తెలియచేస్తోంది. ముందు చూపు అనేది అన్ని వేళల అవసరమే.