నకిలీ శానిటైజర్లు తయారీ ముఠా అరెస్ట్..?
అక్కడి నుంచి రూ.5లక్షల విలువగల నకిలీ శానిటైజర్లు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరు కొవిడ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని శానిటైజర్ విక్రయాలపై దృష్టి పెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రముఖ బ్రాండ్ల పేరుతో స్టిక్కర్లు, బ్యాచ్ నంబర్లు గోదాములో బాటిళ్లకు అతికించి అందులో నకిలీ శానిటైజర్ను నింపి నగరంలోని దుకాణాలకు విక్రయిస్తున్నారు. లీటరు రూ.100 చొప్పున క్యాన్లలో విక్రయించడంతో పాటు చిన్న స్ప్రే బాటిల్స్ హోల్సేల్ ధరలకు ఫ్యాన్సీ, మందుల దుకాణాలకు విక్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమంది నకిలీ శానిటైజర్ల తయారీదారుల వివరాలపై కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. కరోనా టైంలో ఇటువంటి మోసాలు వెలుగు చూడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.