వెలగ పండు స్మూతి తయారు చేయు విధానం....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...వెలగ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పుల్లగా నోట్లో నీళ్లూరుతాయి. ఇది తింటే. ఇక వెలగ పండుతో ఈ వెలగ పండు స్మూతిని  ఎప్పుడైనా చేసుకోని తిన్నారా? ఒకసారి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా ఈ వెలగ పండు స్మూతిని ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఎలా  తయారు చేసుకోవాలో తెలుసుకోండి...
వెలగ పండు స్మూతీకి 
కావలసిన పదార్ధాలు... వెలగపండు -1; తేనె- 2 టేబుల్‌ స్పూన్లు; ఓట్స్‌ - ఒక టేబుల్‌ స్పూను; పెరుగు- అర కప్పు; తాజా కొబ్బరి తురుము - ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్‌ స్పూను..


గార్నిషింగ్‌ కోసం....దానిమ్మ గింజలు- ఒక టీ స్పూను; మామిడికాయ ముక్కలు - ఒక టీ స్పూను; జీడిపప్పు ముక్కలు - ఒక టీ స్పూను.


వెలగ పండు స్మూతి తయారు చేయు విధానం....ముందుగా  ఓట్సును తియ్యటి నీళ్లలో లేదా ఏదైనా పళ్లరసంలో పది నిమిషాలు నానబెట్టాలి. వెలగపండును పగులగొట్టి గుజ్జు బయటకు తీసి, రెండు కప్పుల నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాలి. మెత్తగా పిసికి, పీచును, గింజలను వేరు చేయాలి. మిక్సీలో వెలగ పండు గుజ్జు, తేనె, ఐస్‌ క్యూబ్స్, బెల్లం పొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన ఓట్స్, ఏలకుల పొడి, పెరుగు, మిరియాల పొడి వేసి మెత్తగా చేయాలి. గ్లాసులలో పోసి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, జీడిపప్పు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలతో అలంకరించి అందించాలి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: