చికెన్ ఉలవచారు బిర్యానీ ఎలా అంటే...!

Sahithya
చికెన్ బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది చికెన్ ఉలవచారు బిర్యాని. ఇప్పుడు దీనికి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి మీకు అది ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. అసలు దానికి ఎం కావాలంటే... బాస్మతీ రైస్‌, చికెన్- ఒక కేజీ చొప్పున కావాలి. ఉలవచారు – అర కిలో, నిమ్మ కాయలు - రెండు, ఉల్లిపాయలు (తరిగి), పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు,పచ్చి మిర్చి (చీలికలు)- 150 గ్రాములు చొప్పున కావాలి. అదే విధంగా పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌ స్పూన్లు కావాలి. బిర్యానీ ఆకులు- నాలుగు, నెయ్యి – వంద గ్రాములు కావాలి. బిర్యాని మసాలా దినుసులు, పసుపు – 50 గ్రాములు, ఉప్పు, కారం తగినంత వేయండి.

తయారీ విధానం ఎలా అంటే... గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులను వేయించండి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగిన తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయండి. ఆ తర్వాత రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయండి. అప్పుడు నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పు వేసి ఉడికించండి. ఆ తర్వాత వేరొక గిన్నెలో రెండు టీ స్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేయించండి. గోధుమ రంగులోకి అవి వచ్చిన తర్వాత అల్లం వెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయండి.

రెండు నిమిషాలు వేగాక అర లీటరు నీళ్లు పోసి ఉడికించండి. ఆ తరువాత అందులో అర కిలో (తయారుగా ఉన్న) ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొంచెం సేపు ఉడికించండి. ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి ఆ తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే చాలు ఉలవచారు బిర్యాని రెడీ అయినట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: