అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మొగుడినే లేపేయించింది?

frame అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మొగుడినే లేపేయించింది?

Chakravarthi Kalyan
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య సంఘటన అనంత పురం జిల్లాలో జరిగింది. అనంతపురం లో ఈనెల 1న నగరంలోని కియా కార్ల షోరూం వద్ద కాశీ దారుణ హత్యకు గురయ్యాడు. తన భర్తను హత్య చేశారని కాశీ భార్య సౌభాగ్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హత్యకేసును ఛేదించిన అనంతపురం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ హత్యకేసు వివరాలను మీడియాకు వెల్లడించిన అనంతపురం గ్రామీణ పీఎస్ సీఐ శేఖర్ అసలు గుట్టు చెప్పారు. కథేంటంటే.. మృతుడు కాశీ పని చేసే టమోటా మండీ వద్ద కూలీ నవాజ్ బేగ్ తో సౌభాగ్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్యకు పక్కా ప్లాన్ వేసిన సౌభాగ్య దాన్ని అమలు చేసి మొగుడిని హత్య చేయించిందని సీఐ శేఖర్ తెలిపారు. ఈ  హత్య కేసులో సౌభాగ్య, నవాజ్ తో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More