ఏపీ: మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్కార్..!

FARMANULLA SHAIK
ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై దృష్టి పెట్టారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.దాంట్లో భాగంగానే డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.కనిష్టంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందించనున్నారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లించాలి. 2024- 25 ఏడాదికి సంబంధించి రూ. 250కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.అలాగే రుణాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రుణం ఇవ్వడంతో పాటుగా 35శాతం వరకు రాయితీని కూడా ప్రకటించింది. అంటే రూ. లక్ష రుణం తీసుకుంటే అందులో రూ.35వేలు రాయితీ కింద మినహాయింపు ఇస్తుంది. అలాగే ఒక్కో మహిళకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారు.ప్రభుత్వం 35% రాయితీ వర్తించే.. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో ఏర్పాటు చేసుకోగలిగే యూనిట్ల వివరాలు ఇలా ఉన్నాయి. కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్‌ యూనిట్‌‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే బేకరీ, స్వీట్‌ షాప్,‌ ఐస్‌క్రీమ్‌తేనె తయారీ.. అప్పడాల తయారీ, వెజిటబుల్‌ సోలార్‌ డ్రయ్యర్‌, భోజనం ప్లేట్ల తయారీ, డీజే సౌండ్‌ సిస్టమ్‌, డెయిరీ, పౌల్ట్రీ,ఊరగాయల తయారీ, ప్యాకింగ్‌ యూనిట్‌‌లు ఏర్పాటు చేసుకోవచ్చు.ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ప్రకటన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై  ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: