చంద్రబాబే నాకు స్ఫూర్తి.. పరోక్షంగా చెప్పేసిన కేసీఆర్‌?

Chakravarthi Kalyan
పదేళ్లు అధికారం అనుభవించిన తర్వాత కేసీఆర్‌ ఓడిపోయారు. ఓటమి తర్వాత కేసీఆర్‌ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుస్తారా అన్నట్టు పార్టీ పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక కేసీఆర్‌ పని ఫినిష్‌ అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి పలుసార్లు అదే చెబుతున్నారు.
దీనిపై స్పందించిన కేసీఆర్‌.. ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఫినిష్‌ కావడం ఉండదని అన్నారు. ఇందుకు ఆయన అనేక ఉదాహరణలు చూపించారు. టీడీపీ దాదాపు పదిహేనేళ్లు అధికారానికి దూరంగా ఉందని.. మళ్లీ ఏపీలో అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కూడా తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల బీఆర్‌ఎస్‌ ఫినిష్‌ అన్న వాదనలో ఏ మాత్రం అర్థం లేదని.. మళ్లీ బంపర్‌ మెజారిటీతో బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: