మళ్లీ రాజకీయ రంగంలో మాజీ సీఎం.. గెలుస్తారా?

Chakravarthi Kalyan
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఈసారి ఆయన అడుగుపెడుతోంది పార్లమెంటు రణక్షేత్రంలో. తాజాగా లోక్‌సభ అభ్యర్థులతో 5వ లిస్ట్ విడుదల చేసిన బిజెపి.. ఆయనకు రాజంపేట సీటును కేటాయించింది. 111 మందితో కూడిన జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ అరూరి రమేష్, ఖమ్మం తాండ్ర వినోద్ రావు పేర్లను  బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... రాజంపేట నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపింది. రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ,  తిరుపతి వరప్రసాద్ పేర్లను బీజేపీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: