తెలంగాణ వ్యవసాయంలో కొత్త ప్రయోగం?
వాతావరణ మార్పుల నేపథ్యంలో వైరస్, బ్యాక్టీరియా పరీక్షలు అత్యంత సమర్థవంతంగా ప్రాసెస్ చేయగల సామర్థ్యం మూడు ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగం నుంచి 18 నుంచి 20 శాతం పైగా ఆదాయం జీఎస్డీపీకి సమకూరుస్తుందని, 60 శాతం ఆధారపడి ఉన్నందున విత్తన రంగంలో సీడ్ లైసెన్స్, నిల్వలు, డీలర్ల వ్యవస్థ అంతా ఆన్లైన్ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. పారదర్శకత, విధానాల రూపకల్పన కోసం రైతుల వివరాలు, ల్యాండ్ డేటా కంప్యూరీకరణ చేయడమే కాకుండా వ్యవసాయ పంటల నమోదు, ఇతర వివరాలు అన్నీ కూడా పరిశ్రమ, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు పాలుపంచుకునేలా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేశామని చెప్పారు.