ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మోదీకి తాకట్టు పెట్టేశారా?
ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు అన్న కేశినేని నాని.. పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యాడన్నారు. ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని.. చంద్రబాబు, పవన్కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం కూడా చేత కాలేదని కేశినేని నాని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనమవుతాయన్న కేశినేని నాని... రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడన్నారు.