కవిత అరెస్ట్.. టీడీపీ పండుగ చేసుకుంటోందా?
గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ధర్నా చేస్తే కేటీఆర్ అడ్డుకున్నారని.. ఆనాడు ధర్నాలు అడ్డుకున్న వారే ఇవాళ కవిత కోసం ధర్నా చేయడం విడ్డూరమన్నారు. ఏపీ అంశాలపై హైదరాబాద్లో ధర్నా ఎందుకని అప్పట్లో అన్నారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ధర్నా ఎందుకని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. దిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు చేసుకోండని సూచించారు. అప్పట్లో
ఎవడొస్తాడో రా చూసుకుందాం అని తొడలు కొట్టారన్న మంత్రి కోమటిరెడ్డి..ఇప్పుడేమో అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారన్నారు.