కవిత అరెస్ట్.. టీడీపీ పండుగ చేసుకుంటోందా?

Chakravarthi Kalyan
కేసీఆర్‌ కుమార్తె కవిత మద్యం కేసులో అరెస్టు కావడంతో టీడీపీ సోషల్ మీడియా పండగ చేసుకుంటోంది. గతంలో చంద్రబాబు అరెస్టయినప్పుడు కేటీఆర్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. అప్పట్లో హర్ట్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు కసి తీర్చుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయం ప్రస్తావిస్తున్నారు.

గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ధర్నా చేస్తే కేటీఆర్ అడ్డుకున్నారని.. ఆనాడు ధర్నాలు అడ్డుకున్న వారే ఇవాళ కవిత కోసం  ధర్నా చేయడం విడ్డూరమన్నారు. ఏపీ అంశాలపై హైదరాబాద్‌లో ధర్నా ఎందుకని అప్పట్లో అన్నారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. మరి  ఇప్పుడు ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ధర్నా ఎందుకని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.  దిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు చేసుకోండని సూచించారు. అప్పట్లో
ఎవడొస్తాడో రా చూసుకుందాం అని తొడలు కొట్టారన్న మంత్రి కోమటిరెడ్డి..ఇప్పుడేమో అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: