రేవంత్పై తప్పుడు వార్త.. ఆ పత్రికపై ఫిర్యాదు?
బేగంపేట విమానాశ్రయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు గంటలపాటు రహస్యంగా రాజకీయ చర్చలు జరిపారని ఒక నిరాధార వార్తలు ప్రచురించిందని ఆయన ఫిర్యాదులో తెలిపారు. ఆ వార్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే ఏకైక ఉద్దేశ్యంతో ప్రచురించబడిందని.. తెలంగాణ ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించేందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇమేజ్ను దెబ్బతీయడానికి నమస్తే తెలంగాణ లో ఈ వార్త ను ప్రచురించారని తెలిపారు.