హరీశ్‌రావుపై దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన లీడర్‌?

Chakravarthi Kalyan
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అంటున్నారు. కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు. ప్రభుత్వ, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తూ వస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు.

అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తానన్న ఆయన... ఎల్లపుడూ ఉద్యోగుల హక్కుల కోసం అండగా నిలిచే తనపై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని హరీశ్‌రావు కోరారు. ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి నాలుగు కరువు భత్యాలు విడుదల చేయాలని... ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వేతన సవరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని హరీశ్‌రావు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: