ఒకేసారి ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత నాదే?

Chakravarthi Kalyan
దేశ చరిత్రలో ఒకేసారి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత తనకే దక్కుతుందని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి అంటున్నారు. హీరో సాయిరాం శంకర్ నటించిన వెయ్ దరువేయ్ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రమణారెడ్డి.. పేరు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పదేళ్ల కిందట తనను నియోజకవర్గంలో ఎవరూ గుర్తుపట్టలేదని.. ఇప్పుడు విదేశాల్లో సైతం తనతో కలిసి ఫొటోలు దిగుతున్నారని రమణారెడ్ పేర్కొన్నారు. ఇందుకు కారణం కేసీఆర్, రేవంత్ రెడ్డిలేనన్న రమణారెడ్డి.. తన పార్టీ గెలిచి మంత్రి పదవి వస్తే సినిమాటోగ్రఫి శాఖను తీసుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేదన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగినట్లు రమణా రెడ్డి పేర్కొన్నారు. సినిమా రంగంపై ఉన్న అభిరుచిని పంచుకున్న రమణారెడ్డి.... ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఆడిషన్స్ కూడా వెళ్లానని గుర్తు చేసుకున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: