కుటుంబమంతా.. టీలో ఎలుకల మందు కలుపుకుని..?

Chakravarthi Kalyan
పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణ రెడ్డిపురం తండాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. టీ లో ఎలుకల మందు కలిపి ముగ్గురు పిల్లలతో సహా భార్య, భర్త చనిపోయారు. భర్తకు, పిల్లలకు  ఆ టీ ఇచ్చిన భార్య తాను కూడా తాగింది. ఈ ఘటనలో సోమవారం రెండేళ్ల ఈశ్వర్ మృతి చెందాడు. గత రాత్రి 11 ఏళ్ల బాను ప్రకాష్ కూడా మృతి చెందాడు. నిన్న హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి ఉమేశ్ కూడా మృతి చెందాడు.
మరోవైపు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి వసంత మృతి చెందింది.  హైదరాబాద్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న భర్త రవి నాయక్ మాత్రం కుటుంబంలో ప్రాణాలతో బతికి ఉన్నాడు. 12 ఏళ్ల కిందట రవి నాయక్, వసంతకు వివాహం అయ్యింది. అయితే.. ఆర్ధిక సమస్యల వల్ల తరచు భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: