చిలకలూరిపేట అభ్యర్థి ఎవరో ప్రకటించిన విజయసాయి?
గత పాలనలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి... చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సామాజిక సాధికార యాత్ర దేశంలోనే ఎవరూ చేయని ఓ అద్భుతమైన కార్యక్రమమన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. వచ్చే ఎన్నికలు ధనికులకు.. పేదవారికి మధ్య జరిగే ఓ రెఫరండమని అన్నారు. ఈ యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదవారి పక్కన వైఎస్ జగన్ నిలబడి వారిని గెలిపిస్తారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు.