వ్యవసాయం.. దేశంలోనే తెలంగాణ రికార్డ్?

Chakravarthi Kalyan
వ్యవసాయం అనేది సుస్థిర, భరోసా గల రంగంగా దేశంలో తెలంగాణ రికార్డు సాధించిందని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు. స్వరాష్ట్రంలో గంభీరమైన ప్రాతిపదికన వ్యవసాయం మొదలైంది.. ప్రధమ ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వడం వల్ల అద్భుత ప్రగతి సాధ్యమైంది.. ఒక ఆశ కల్పించి అన్నదాతకు రైతుబంధు, బీమా పథకాలు ధీమా కల్పించాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.


రాష్ట్రంలో 58 శాతం జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.. గ్రామసీమలు పచ్చబడ్డాయి.. ఈ ప్రబల మార్గం కళ్ల ముందు కనిపిస్తున్నాయి.. తెలంగాణ ముఖచిత్రం వ్యవసాయం మార్చేసింది.. వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక తపస్సుతో పని చేశానని  నిరంజన్ రెడ్డి అంటున్నారు. శాఖలో పనిచేసిన ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేశారని.. ఇదంతా ఎంతో ఆత్మసంతృప్తి కలిగిస్తుందని.. ఒకప్పుడు టీఎస్ అగ్రోస్ నష్టాలబాటలో ఉంటే ఇప్పుడు లాభాల్లోకి వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: