గుడ్‌న్యూస్: నేటి నుంచే మోదీ కొత్త స్కీమ్‌? అప్లై చేసుకోండి!

Chakravarthi Kalyan
ఇవాళ మోదీ పుట్టిన రోజు.. అందుకే మోదీ జన్మదినం రోజైన ఈ సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి విశ్వ కర్మ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రధాన మంత్రి ప్రారంభించే పతకాన్ని అన్ని జిల్లాల్లో ప్రజలు వీక్షించెలా తెలంగాణలో బీజేపీ ఓబీసీ మోర్చా ఏర్పాట్లు చేసింది. 140జాతులకు సంబంధించి 18వృత్తుల వారు ఈ పథకం ద్వారా లబ్ధిపొంద బోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి విశ్వ కర్మ పతకాన్ని అమలు చేస్తోందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత దేశం యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కుల వృత్తులు, చేతి వృత్తుల మీద ఆధార పడి ఉంది. గత పాలకులు ఈ  వర్గాలను విస్మరించాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పాలకుల యొక్క ఆలోచన విధానం పెట్టుబడి దారులకే పెద్ద పీట వేయడం జరిగిందని వారు అంటున్నారు. దీని వల్ల లక్షల కుటుంబాలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాయని.. అందుకే మోదీ ఈ విశ్వకర్మ పథకం తెచ్చారని అంటున్నారు. కుల, చేతి వృత్తుల వర్గాలను ఆదుకోవాలని ఆధునీకరించిన పరికరాలను ఈ పథకం ద్వారా అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: