అలా నేను అనలేదు మొర్రో అంటున్న ఏపీ మంత్రి?

Chakravarthi Kalyan
గురువుల కన్నా గూగుల్ మేలని తాను వ్యాఖ్యలు చేసినట్టుగా దుష్ప్రచారం జరుగుతోందని ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అంటున్నారు. ఆ తరహా వార్తలను తాను ఖండిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మారుతున్న కాలానికి సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని కొంతమంది గూగుల్ పై ఆధారపడుతూ గురువులను మర్చిపోతున్నారన్న ఉద్దేశంలోనే తాను మాట్లాడానని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం కలిగిన వ్యక్తిగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

అంతే కాదు.. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయులతో సత్సంబంధాలు కలిగి ఉన్నానని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అయితే.. ఏ సాంకేతికత కూడా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదనే కనీస ఆలోచన లేకుండా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడటం దారుణమని యుటియఫ్ నేతలు విమర్శించారు. విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య నిరంతర భౌతిక సంబంధాలు ఉండటం ద్వారానే పరిపూర్ణ విద్యార్థిగా తయారు అవుతారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: