పవన్‌ ఫ్యామిలీపై కామెంట్లు.. పోలీసులకు ఫిర్యాదు?

Chakravarthi Kalyan
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలపై... తెలంగాణ జనసేన నాయకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేసారు. వైసిపి సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి వర్రా రవీంద్రరెడ్డి.. సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.  


వైసిపి నాయకుల కుటుంబాల్లోనూ మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పి.శిరీష అన్నారు. తమ నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ తమకు విలువలతో కూడా రాజకీయాలు నేర్పారని.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పలేని వారే ఇలా చేస్తారని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పి.శిరీష అన్నారు. సాటి మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే మహిళా కమిషన్‌ వాసిరెడ్డి పద్మ ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: