సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. మరో చిన్నారి వైద్య చికిత్సలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేనున్నానంటూ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన నిమిత్తం నిన్న వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో కొవ్వూరు మండలం ఔరంగబాద్ గ్రామానికి చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం సీఎం జగన్ కు తెలిపారు. ఆదుకోవాలని సీఎం జగన్ కు అర్జీ అందచేశారు.
బేబీ నిస్సి అనారోగ్య పరిస్థితి తెలుసుకుని సీఎం జగన్ చలించి పోయారు. సీఎం వైయస్ జగన్..తక్షణ ఆర్థిక సహాయం అందించి, తగిన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. చిన్నారి కుటుంబానికి అండగా నిలుస్తామని సిఎం సీఎం జగన్ భరోసా ఇచ్చారు.