జూ. ఎన్టీఆర్కు కేసీఆర్ ప్రయారిటీ.. బాలయ్యకు కోపమా?
దీనిపై చర్చ కోసం హైదరాబాద్ లో మంత్రి పువ్వాడ అజయ్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. జూబ్లీహిల్స్ లోని తారక్ నివాసానికి వెళ్లి విగ్రహ ఆవిష్కరణకు లాంఛనంగా పువ్వాడ ఆహ్వానించారు. ఆవిష్కరణకు సంబంధించి ఇద్దరూ చర్చించారు. శ్రీకృష్ణుడి అవతారంలో 54 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు సమారు రెండు కోట్ల రూపాయలకుపైగా ఖర్చయింది. మంత్రి పువ్వాడ అజయ్ చొరవతో తానా సభ్యులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించారు.