అదానీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందా?
అన్ని సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్, దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మిలియన్ల మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరపున మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.