వాలంటీర్లకు జగన్ మరో గుడ్ న్యూస్?
ధాన్యం సేకరణ పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని ఆదేశించిన సీఎం.. ధాన్యం సేకరణలో వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. అంతే కాదు.. వారి సేవలను వినియోగించుకున్నందుకు ప్రోత్సాహకాలు కూడా అందించాలని నిర్ణయించారు. దీని కోసం ఎస్ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు వాటిని సీఎంకు వివరించారు. దీనిద్వారా వాలంటీర్లకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.