జగన్.. కాపు ద్రోహిగా మిగిలిపోతారా?
ఎన్నో ఏళ్లుగా కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమాలు చేస్తుంటే, జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రిజర్వేషన్ కల్పించే అంశం రాష్ట్ర పరిధిలో లేదని కేంద్రం పరిధిలో ఉంటుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఆయా రాష్ట్రాలకు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని..ఇకనైనా కాపులను బీసీల్లో చేర్చే అంశం తమ పరిధిలో ఉందా లేదా అన్నది ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.