చంద్రబాబుకు డెడ్‌లైన్‌ ఇవాళే?

Chakravarthi Kalyan
విజయవాడ ఆస్పత్రిలో రాష్ట్ర మహిళా కమిషన్ ముందు అనుచితంగా ప్రవర్తించినందుకు విచారణకు హాజరైన వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చంద్రబాబు, బోండా ఉమకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా విచారణకు హాజరయ్యేందుకు వాసిరెడ్డి పద్మ ఇచ్చిన గడువు ఇవాళే.. ఈనెల 27 ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని వాసిరె‌డ్డి పద్మ నోటీసులు పంపారు. మరి ఈ నోటీసులను చంద్రబాబు గౌరవిస్తారా..లేదా అన్నది చూడాలి. అయితే నోటీసులను టీడీపీ నేతలు లెక్కచేయకుండా మాట్లాడుతున్నారని ఇప్పటికే వాసిరెడ్డి పద్మ అంటున్నారు. ఇవాళే రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో ఆందోళనలకు పిలుపు ఇవ్వడం ఏంటని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మహిళా కమిషన్ ముందు హాజరు కావటాన్ని చిన్నచూపుగా టీడీపీ నేతలు భావించాల్సిన పని లేదన్నారు. ఈ వ్యవహారానికి సామరస్యపూర్వక ముగింపు పలకాలా.. సీరియల్ మాదిరిగా కొనసాగించాలా అన్నది టీడీపీ నేతల చేతుల్లోనే ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: