చంద్రబాబు: ఓటమి భయంతోనే అలాంటి పని చేశారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల పోలింగ్  నిన్నటి రోజున ముగిసింది.. దాదాపుగా 80% పైగా పోలింగ్ నమోదైనట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ఈ విషయం పైన క్లారిటీ రాలేదు.. పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున ఓటర్లు కూడా తరలివచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ శాతం మరింత ఎక్కువగా ఉన్నది.. మహిళా ఓటర్లతో గ్రామాలలోని ఒక జాతర వాతావరణం కనిపించింది.. అర్బన్ ప్రాంతాలలో కూడా మధ్యాహ్నం తర్వాత కాస్త ఓటర్ల హవా తగ్గింది.

టిడిపి ఓటమి భయంతోనే హింసాత్మకను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందని వైఎస్ఆర్సిపి కార్యదర్శి సజ్జల రామకృష్ణ కూడా తెలియజేశారు.. ముఖ్యంగా కుప్పం, తాడిపత్రి, చిత్తూరు, మాచర్ల తదితర నియోజకవర్గాలలో టిడిపి పార్టీ హింసాత్మకమైన ఘటనలను తీసుకువచ్చింది అంటూ ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు.. ఓటమి భయంతో టీడీపీ నాయకులు కూడా దాడులు చేస్తున్నారని వైసిపి శ్రేణులు కూడా తెలియజేస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళల పైన దుష్ప్రచారాలు ఆడుతూ బెదిరిస్తూ దాడులకు దిగుతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి..

అలాగే కొంత మంది బెదిరించడానికి ఇతర రాష్ట్రాల నుంచి టిడిపి నేతలు బౌన్సర్లను కూడా దింపారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజవర్గాలలో ఇలాంటివి ఎక్కువగా జరిగినట్లుగా సమాచారం.అయితే ఇదంతా ఓటమి భయంతోనే చంద్రబాబు చేసిన పన్నాగం అన్నట్లుగా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల నెమ్మదిగా కొనసాగిందని తెలుస్తోంది. మరి కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కువగా చోటు చేసుకున్నాయట. పోలింగ్ శాతం అయితే భారీగానే నమోదు అయ్యిందని పార్టీలు ఓటర్లు ఎవరికి మద్దతు నిలిచారు అనే విషయం పైన త్వరలోనే లెక్కలు తేలుతాయి.. మరి ఏ మేరకు ఎవరు అధికారాన్ని చేపడతారు తెలియాలి అంటే మరో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. మరి ప్రజల తీర్పు ఎలా ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: