ఇదేంది కేసీఆర్.. ధనిక రాష్ట్రంలో వాయిదా పద్దతిలో జీతాలా?
ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పులు కుప్పగా మార్చలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల బిల్లులు అన్నీ తక్షణమే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.