సూపర్‌: ఇక మాస్కు తీసేయొచ్చట..?

Chakravarthi Kalyan
ఇండియాలో కరోనా కేసులు తగ్గిపోతున్న దృష్ట్యా ఇక మాస్క్ నిబంధన తొలగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు నిబంధనను ఇక సడలించొచ్చని.. భారత్‌లో తీవ్ర కొవిడ్‌ ఉద్ధృతులకు ఆస్కారం తక్కువేనని నిపుణులు సూచిస్తున్నారు. ఆగ్నేయాసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కేసులు తీవ్రంగా పెరుగుతున్నా... భారత్‌లో కలవరం అనవసరమంటున్నారు నిపుణులు. ముందు ముందు వచ్చే కొవిడ్‌ వేవ్‌లు భారత్‌పై పెను ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు.


ప్రస్తుతం రోజువారీ కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడుతున్నందున మాస్కు నిబంధనలను సడలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని దిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు సంజయ్‌ రాయ్‌ తెలిపారు. గత ఏడాది భారత్‌లో తీవ్రస్థాయిలో రెండో కరోనా ఉద్ధృతి తలెత్తడం ఇప్పుడు మన బలంగా మారిందంటున్నారు నిపుణులు. ఎందుకంటే సహజసిద్ధ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారికి దీర్ఘకాల రక్షణ లభించిందని.. భవిష్యత్‌లో కరోనా ఉద్ధృతి వచ్చినా అది పెను ప్రభావం చూపదని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్పే వరకూ మనం మాత్రం మాస్కు తీయకూడదండోయ్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: