కల్తీసారా మరణాలపై లోకేశ్ నిరసన?
అసెంబ్లీకి నిరసన ర్యాలీగా వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లు లభిస్తున్నాయంటూ మద్యం సీసాలతో అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కల్తీసారా మరణాల్ని సహజమరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్న టీడీపీ నేతలు.. కల్తీసారా అరికట్టి రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. జంగారెడ్డి గూడెంలో గత కొద్దిరోజులుగా నాటుసారా వల్ల చనిపోయింది 25మందేనని.. కానీ.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వందల మంది చనిపోయారని టీడీపీ నేతలు అంటున్నారు.