5 రాష్ట్రాల్లో ఓటమి.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం?
ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియానే ఉండాలని సీడబ్ల్యూసీ భేటీ నిర్ణయించింది. నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సీడబ్ల్యూసీ మీటింగ్ గంటల తరబడి సాగింది. చివరకు ప్రస్తుతానికి సోనియా గాంధీనే నాయకురాలిగా ఉండాలని పార్టీ కీలక ప్రతినిధులు కోరారు.