కల్తీసారా మరణాలపై కదిలిన చంద్రబాబు? రేపు పర్యటన!

Chakravarthi Kalyan
రేపు పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి చనిపోయిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. జంగారెడ్డిగూడెం మరణాలన్నీ ప్రభుత్వం హత్యలేనని చంద్రబాబు మండిపడుతున్నారు. కల్తీసారా కారణంగా బాధితులు చనిపోతున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఇంత మంది ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొద్దిరోజుల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వివిధ వార్డులలో 18 మంది మృతి చెందారని చంద్రబాబు మండిపడ్డారు. తాజా మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చెయ్యాలన్న చంద్రబాబు.. స్థానికంగా ఉన్న భయాందోళనలను పోగొట్టాలని సూచించారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని.. వారికి పరిహారం ప్రకటించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: