కల్తీసారా మరణాలపై కదిలిన చంద్రబాబు? రేపు పర్యటన!
గత కొద్దిరోజుల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వివిధ వార్డులలో 18 మంది మృతి చెందారని చంద్రబాబు మండిపడ్డారు. తాజా మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చెయ్యాలన్న చంద్రబాబు.. స్థానికంగా ఉన్న భయాందోళనలను పోగొట్టాలని సూచించారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని.. వారికి పరిహారం ప్రకటించాలని కోరారు.