హరిహర వీరమల్లు: ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మరో కొత్త అప్డేట్?

Purushottham Vinay
హరిహర వీరమల్లు  సినిమాకు మొదట్లో ఎంత హైప్ వచ్చిందో అంతే వేగంగా అంచనాలను ఈ సినిమా తగ్గించేసుకుంది. సినిమా దర్శకుడు క్రిష్ ఎలాగైనా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్కయ్యేలా చేయాలని చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. కానీ షూటింగ్ మాత్రం చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది.ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బాగా బిజీగా ఉండడం అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా హఠాత్తుగా మార్పులు చేయడం వలన ఈ సినిమాకు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. ఒకానొక టైంలో మూవీ ఆగిపోయిందని డైరెక్టర్ క్రిష్ చేతులెత్తేశాడని వార్తలు వచ్చాయి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నిర్మాత రత్నం మాత్రం అసలు ఈ మూవీని వదలడం లేదు. కచ్చితంగా సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.ఇక పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.అసలు ఎవరు ఈ సినిమా గురించి మర్చిపోకుండా చేయాలి అని నిర్మాత సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ఈ మూవీ గురించి హడావుడి చేస్తూనే ఉన్నారు. ఇక డైరెక్టర్ ఈ సినిమా నుంచి తప్పకున్నారా అనే సందేహాలు అయితే చాలాసార్లు వినిపించాయి. 


ఎందుకంటే అతను హఠాత్తుగా హీరోయిన్ అనుష్కతో కొత్త సినిమా స్టార్ట్ చేయడంతో హరిహర వీరమల్లు సినిమా మరో డైరెక్టర్ చేతిలోకి వెళ్లిపోతుందేమో అనే విధంగా గాసిప్స్ వినిపంచాయి.అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిర్మాత రత్నం అప్పట్లోనే ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు రాబోయే అప్డేట్ కు సంబంధించి ఒక పోస్టర్ ని విడుదల చేయగా అందులో దర్శకుడి పేరు అయితే కనిపించలేదు. దీంతో మళ్ళీ ఈ విషయంపై ఒక్కసారిగా డౌట్స్  క్రియేట్ అయ్యాయి. ఇక మేకర్స్ నుంచి అందుతున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ పోస్టర్ లో క్రిష్ పేరు కనిపించకపోయినా వచ్చే అప్డేట్ లో మాత్రం క్రిష్ పేరు ఉంటుందని సమాచారం తెలుస్తుంది.అసలు ఈ పోస్టర్ లో క్రిష్ పేరు ఎందుకు మిస్సయ్యింది అనే విషయంలో మాత్రం ఇంకా సరైన క్లారిటీ లేదు. మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ని ఇవ్వబోతున్నారు. ధర్మం కోసం యుద్ధం.. అంటూ పోస్టర్ లో ఒక  క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ మళ్ళీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ వచ్చే అప్డేట్ ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: