పెళ్లింట్లో పెను విషాదం.. 11 మంది మృతి..?

Chakravarthi Kalyan
ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకకు వచ్చిన 11 మంది ప్రమాదవశాత్తూ బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.  


వివాహ వేడుకలకు వచ్చిన బంధువులు.. ఓ బావిపై ఉన్న స్లాబ్‌పై కూర్చుకున్నారు. అయితే.. ఒకేసారి ఎక్కువ మంది కూర్చోవడం వల్ల ఆ బావిపైనున్న స్లాబ్‌ కుప్పకూలిపోయింది. దీంతో  సందర్భంగా బావిపై ఉన్న స్లాబ్‌ మీద కూర్చున్న బంధువులు ఒక్కసారిగా బావిలో పడిపోయారు. బావిలో ఒకేసారి 11 మంది వరకూ పడిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఈ ప్రమాదంపై యూపీ సర్కారు స్పందించింది. యూపీ సీఎం యోగి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: