చలో బెజవాడ: 100సీసీ కెమేరాలు.. ఖాకీల వ్యూహం ఇదీ..?
మీసాల రాజరావు వంతెన నుంచి భాను జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పీఆర్సీ సాధన సమితి ప్లాన్ చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వాహన రాక పోకలు అనుమతించబోమని పోలీసులు తెలిపారు.