సంచ‌ల‌నం : అత‌ను అక్క‌డ టికెట్ తెచ్చుకుంటే.. రాజీనామా..?

N ANJANEYULU
అనంత‌పురం జిల్లా టీడీపీ యువ‌నేత ప‌రిటాల శ్రీ‌రామ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌స్తుతం ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జీగా వ్య‌వ‌హ‌రిస్తొన్న ఆయ‌న వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ధ‌ర్మ‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాల‌ని భావిస్తూ ఉన్నారు. ఈ త‌రుణంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ధ‌ర్మ‌వ‌రంలోని దుర్గాన‌గ‌ర్‌లో టీడీపీ ఆధ్వ‌ర్యంలో గౌర‌వ స‌భ‌-ప్ర‌జాస‌మ‌స్య‌ల చ‌ర్చావేదిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి  శ్రీ‌రామ్ పాల్గొని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
ముఖ్యంగా ధ‌ర్మ‌వ‌రంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటాను అని, ఓ నాయ‌కుడు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని.. నిజంగానే ఆయ‌న టికెట్ తెచ్చుకుంటే తాను రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాను అని ఓ మాజీ ఎమ్మెల్యేనుద్దేశించి శ్రీ‌రామ్ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లెవ్వ‌రూ ఇలాంటి విష‌యాల‌ను అస‌లు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. పార్టీ బ‌లోపేతం పై ఒక్క‌రూ దృష్టి సారించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. టీడీపీతోనే రాష్ట్ర భ‌విష్య‌త్ అనే అంశాన్ని ప్ర‌జ‌లు విజ్ఞ‌త‌తో ఆలోచించాల‌న్నారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌క‌వర్గం నుంచి ప‌రిటాల శ్రీ‌రామ్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: