విపక్షాల ఆందోళనతో లోక్సభ వాయిదా
ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. రైతుల సమస్యలు, ఎంఎస్పీ పై చట్టపరమైన హామీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ విపక్షాల నేతలు వెల్లోకి వచ్చారు. ముఖ్యంగా రైతుల సమస్యలపైనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేసాయి. దీంతో పార్లమెంట్లో ఒక్కసారిగా రగడ రగిలింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్సభ వాయిదా పడింది.